మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ మేనల్లుడు, వ్యాపారవేత్త రతుల్ పురీ ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోదాలు నిర్వహించింది. ఆయన తండ్రి నివాసం సహా మొత్తం ఏడు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేశారు అధికారులు. తన కంపెనీ పేరిట.. రూ. 787 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు రతుల్, ఆయన తండ్రి సహా మరికొంతమందిపై ఆరోపణలున్నాయి.
హవాలా కేసులో మాజీ సీఎం మేనల్లుడి ఇంట్లో సోదాలు - వ్యాపారవేత్త రతుల్ పురీ ఇంట్లో సీబీఐ సోదాలు
బ్యాంకులను మోసం చేసి రూ.787 కోట్ల అక్రమ నగదు చలామణీకి పాల్పడిన ఆరోపణలపై వ్యాపారవేత్త రతుల్ పురీ ఇంట్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఆయన తండ్రి నివాసం సహా మొత్తం 7 చోట్ల తనిఖీలు చేసింది.
హవాలా కేసులో సీఎం మేనల్లుడి ఇంట్లో సోదాలు
ఇదే కేసు విషయంలో గురువారం కేసు నమోదుచేసినట్లు తెలిపారు సీబీఐ అధికారులు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పీపీఈ కిట్లు ధరించి మరీ సోదాలు చేశారు.
ఇదీ చూడండి:ఆ మాస్టారు చెప్పే 'లౌడ్ స్పీకర్ క్లాసు'లకు పిల్లలు ఫిదా
Last Updated : Jun 26, 2020, 4:25 PM IST