తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2020' రద్దు

మొబైల్​ వరల్డ్ కాంగ్రెస్- 2020ను రద్దు చేస్తున్నట్లు జీఎస్​ఎమ్​ఏ ప్రకటించింది. 'కొవిడ్​-19' ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో... ఆరోగ్య భద్రతా సమస్యల కారణంగానే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొంది. 2021లో స్పెయిన్​లోని బార్సిలోనాలోనే మరలా ఈ మొబైల్ కాంగ్రెస్​ను నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

By

Published : Feb 13, 2020, 11:22 AM IST

Updated : Mar 1, 2020, 4:52 AM IST

Mobile World Congress 2020 cancelled
కరోనా భయాలతో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2020 రద్దు

స్పెయిన్​ బార్సిలోనాలో జరగాల్సిన 2020 'మొబైల్​ వరల్డ్​ కాంగ్రెస్' రద్దు అయ్యింది. కొవిడ్​-19 వైరస్​ అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య భద్రత రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ టెలికాం పరిశ్రమ సంస్థ జీఎస్​ఎం అసోసియేషన్ తెలిపింది.

2006 నుంచి ఏటా స్పెయిన్​లోని బార్సిలోనాలో మొబైల్ వరల్డ్​ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు, మంత్రులు, విధాన నిర్ణేతలు, ఆపరేటర్లు, పరిశ్రమ పెద్దలు.... టెలికాం, మొబైల్ రంగాల్లో వస్తున్న సాంకేతిక మార్పులను, పరిణామాలను విస్తృతస్థాయిలో చర్చిస్తారు.

ఆదరణ కరవు..

కొవిడ్​-19 నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జీఎస్​ఎమ్​ఏ బోర్డులో ఉన్న సంస్థలతో సహా, కొంత మంది స్పాన్సర్లు, ప్రముఖ ఎగ్జిబిటర్లు మొబైల్ వరల్డ్​ కాంగ్రెస్​ నుంచి వైదొలిగారు. వీటిలో వొడాఫోన్​, సిస్కో, ఎల్​జీ, వివో, ఎన్​టీటీ డొకోమో, సోనీ, అమెజాన్​, ఫేస్​బుక్​, మీడియాటెక్​, ఇంటెల్​, ఎన్విడియా మొదలైన ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

2021పై ఆశాభావం

మొబైల్ వరల్డ్​ కాంగ్రెస్ రద్దు నిర్ణయాన్ని.. ఆతిథ్యం ఇస్తున్న బార్సిలోనా వర్గాలు గౌరవిస్తాయని, అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నట్లు జీఎస్​ఎమ్​ఏ పేర్కొంది. 2021లో ఇక్కడే మరలా ఈ పెద్ద ఈవెంట్​ను నిర్వహించడానికి పరస్పర సహకారం కొనసాగుతుందని జీఎస్​ఎమ్​ఏ స్పష్టం చేసింది. వైరస్​తో విలవిలలాడుతున్న ప్రజలకు మా సానుభూతి తెలుపుతున్నామని జీఎస్​ఎమ్​ఏ ప్రకటించింది.

ఇదీ చూడండి:'సాటిలేని వారసత్వం ఎయిర్​ఇండియా సొంతం'

Last Updated : Mar 1, 2020, 4:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details