తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏప్రిల్​ 1 నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి!

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు, యునైటెడ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఓరియంటల్​ బ్యాంక్​ ఆఫ్​ కామర్స్​ల విలీనం వచ్చే ఏడాది ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ మూడు బ్యాంకుల విలీనంతో దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది పంజాబ్ నేషనల్ బ్యాంకు.

By

Published : Sep 14, 2019, 9:48 PM IST

Updated : Sep 30, 2019, 3:20 PM IST

ఏప్రిల్​ 1 నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ను విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విలీనం అనంతరం రూ.18 లక్షల కోట్ల వ్యాపారంతో ఎస్​బీఐ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది పంజాబ్​ నేషనల్ బ్యాంకు.

" విలీన ప్రక్రియకు కొంత సమయం పట్టనుంది, ఇది ఏప్రిల్‌ 1 నాటికి పూర్తవుతుంది. విలీనం కోసం న్యాయ, నియంత్రణ ప్రక్రియలు పూర్తి కావడం సహా మూడు బ్యాంకుల బోర్డులు ఆమోదం తెలపాలి. విలీన ప్రక్రియ తర్వాత ఉద్యోగుల తగ్గింపు ఉండబోదు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని కూడా అమలు చేయం. "

- అశోక్‌ కుమార్‌ ప్రధాన్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ

విలీనంతో పంజాబ్​ నేషనల్ బ్యాంకు ఉద్యోగుల సంఖ్య ఒక లక్ష, శాఖల సంఖ్య 11వేల 4వందలకు చేరనుంది. మూడు బ్యాంకులకు కలిపి ప్రస్తుతం 6.67శాతం ఉన్న మొండిబకాయిలు.. విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత 6 శాతానికి తగ్గనున్నాయి. విలీనం తర్వాత బ్యాంకుకు నూతన పేరు ఖరారయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: ఒసామా బిన్​ లాడెన్ వారసుడు హమ్జా హతం

Last Updated : Sep 30, 2019, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details