దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) మరోసారి షాకింగ్ ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వాహనాల ధరలు పెంచనున్నట్లు వెల్లడించింది. ముడి పదార్థాల వ్యయాలు పెరిగిన కారణంగా వాహనాల ధరల పెంపు దిశగా యోచిస్తున్నట్లు సోమవారం పేర్కొంది.
'కొన్నేళ్లుగా ముడి పదార్థాల వ్యయాలు పెరగటం వల్ల.. వాహనాల ఉత్పత్తి భారమవుతోంది. ఇలా పెరిగిన అదనపు భారంలో కొంత వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదు.' అని మారుతీ సుజుకీ వెల్లడించింది. అయితే ధరలు ఎంత పెరగొచ్చు అనే విషయంపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మోడల్ను బట్టి ధరల పెరుగుదలలో మార్పులు ఉంటాయని మాత్రం స్పష్టం చేసింది. త్వరలోనే మోడళ్ల వారీగా పెరిగే ధరల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే పలు మార్లు ధరల పెంపు..