తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యం భయాలతో పతనం- సెన్సెక్స్​ 1068 మైనస్​

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1068 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్లు మేర కుదేలయ్యాయి. మోదీ సర్కార్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ మదుపరులను తీవ్రంగా నిరాశపరచడం, ఆర్థిక మాంద్యం పొంచివుందన్న హెచ్చరికలే ఇందుకు కారణం.

By

Published : May 18, 2020, 3:40 PM IST

Markets heavily hit by fears of recession
మాంద్యం భయాలతో భారీగా నష్టపోయిన మార్కెట్లు

ఆర్థిక మాంద్యం భయాలకు తోడు ఉద్దీపన ప్యాకేజీ మదుపరుల్లో విశ్వాసాన్ని కల్పించడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1068 పాయింట్లు కోల్పోయి 30 వేల 28 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 313 పాయింట్లు నష్టపోయి 8 వేల 823 వద్ద స్థిరపడింది.

భారత్​ ఇంతకు ముందు కనీవినీ ఎరుగని ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే అవకాశముందని గోల్డ్​మన్ శాక్స్ గ్రూప్​ అంచనా వేయడమూ మదుపరులను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. మరోవైపు రక్షణ రంగానికి చెందిన షేర్లు బాగా లాభపడ్డాయి. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను సవరిస్తూ.. 74 శాతానికి పెంచిన నేపథ్యంలో మదుపరులు ఈ సంస్థలవైపు మొగ్గుచూపారు.

లాభనష్టాల్లో..

టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, సిప్లా, భారతీ ఇన్​ఫ్రాటెల్, హెచ్​సీఎల్ టెక్ రాణించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, టైటాన్, రిలయన్స్ నష్టపోయాయి.

ఇదీ చూడండి:మార్కెట్లు నష్టాల్లో ఉన్నా రక్షణ రంగ షేర్ల దూకుడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details