తెలంగాణ

telangana

By

Published : Jul 18, 2019, 1:17 PM IST

Updated : Jul 18, 2019, 3:12 PM IST

ETV Bharat / business

మాల్యా అప్పీలుపై వచ్చే ఫిబ్రవరిలో వాదనలు

భారత్​కు అప్పగించాలన్న కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. మాల్యా వేసిన పిటిషన్​ను యూకే హై కోర్టు స్వీకరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11నుంచి మూడు రోజుల పాటు ఈ కేసును విచారించనుంది.

విజయ్ మాల్యా

భారత్​కు అప్పగింతపై లండన్ వెస్ట్​మినిస్టర్​ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వేసిన పిటిషన్​ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విచారించనున్నట్లు యూకే హైకోర్టు వెల్లడించింది. ఫిబ్రవరి 11 నుంచి మూడు రోజుల పాటు ఈ కేసు విచారించే అవకాశం ఉందని పేర్కొంది. భారతీయ బ్యాంకుల్లో రూ.9,000 కోట్ల మోసానికి పాల్పడినట్లు మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులపై విచారణలో 2018 డిసెంబర్​లో లండన్ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు.. మాల్యాను భారత్​కు అప్పగించేందుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేసేందుకు మాల్యా చేసిన మొదటి అభ్యర్థన కోర్టులో తిరస్కరణకు గురైంది.

ఆ తర్వాత ఈ నెల ప్రారంభంలో లండన్​లోని రాయల్ కోర్ట్​ ఆఫ్ జస్టిస్ మాల్యాకు అనుకూలంగా స్పందించింది. భారత్​కు అప్పగింతపై తీర్పును సవాలు చేస్తూ.. హై కోర్టును ఆశ్రయించేందుకు మాల్యాకు అనుమతినిచ్చింది ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం.

ఇదీ చూడండి: మీ క్రెడిట్ స్కోర్​ లెక్కించేది వీరే...

Last Updated : Jul 18, 2019, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details