తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎల్పీజీ సిలిండర్​ ధర రూ.25 పెంపు - ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​

దేశీయంగా ఎల్పీజీ ధరలు మరోసారి పెరిగాయి. సబ్సిడీ లేని సిలిండర్​ ధరపై రూ.25 పెంచింది ఇండియన్​ ఆయిల్​ సంస్థ. తాజా పెంపుతో.. దేశ రాజధాని దిల్లీలో ఒక్కో సిలిండర్​ ధర రూ.719కు ఎగబాకింది.

LPG Cylinder rates hiked Rs.25
రూ.700లకు ఎగబాకిన ఎల్పీజీ సిలిండర్​

By

Published : Feb 4, 2021, 10:31 AM IST

పెట్రోల్‌, నిత్యవసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు.. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి షాక్​ ఇచ్చాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరపై రూ. 25 పెంచుతున్నట్లు ఇండియన్​ ఆయిల్​ సంస్థ ప్రకటించింది.

ఈ పెంపుతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.694గా ఉన్న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్‌ ధర రూ.719కు పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది చమురు సంస్థ.

ఇదీ చదవండి:మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ABOUT THE AUTHOR

...view details