పెంట్ హౌస్ అంటే మనం అపార్ట్మెంట్ పైన ఉండే ఒక ఫ్లాట్ అనుకుంటాం. కానీ బ్రిటన్లో ఏకంగా 140మిలియన్ పౌండ్లకు దాదాపు 15వేల చదరపు అడుగుల పెంట్ హౌస్ను.. లోధా గ్రూప్నకు చెందిన బ్రిటన్ విభాగం లోధా యూకే విక్రయించింది. మన రూపాయల్లో చెప్పుకోవాలంటే 1,300కోట్ల పైమాటే. ఇంత ఖరీదైన విక్రయం ఈ ఏడాది ఇప్పటిదాకా జరగలేదని లోధా గ్రూప్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ పెంట్ హౌస్ ఖరీదు రూ.1300 కోట్లు! - lodha groups britan latest news
లోధా గ్రూప్నకు చెందిన బ్రిటన్ విభాగం 1,300కోట్లు ఖరీదు చేసే పెంట్ హౌస్ను విక్రయించింది. ఇంత ఖరీదైన విక్రయం ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జరగలేదని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక్కో చదరపు అడుగు దాదాపు రూ.9 లక్షలు పలికినట్లు స్పష్టం చేసింది.
![ఈ పెంట్ హౌస్ ఖరీదు రూ.1300 కోట్లు! lodha group pent house sold for highest price](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9493416-956-9493416-1604966235867.jpg)
లండన్లోని నం.1 గ్రోస్వీనర్ స్క్వేర్ ఈ ధర పలికింది. ఈ ప్రాజెక్టు యునైటెడ్ స్టేట్ ఎంబసీకి దగ్గర్లోని మేఫెయిర్లో ఉంది. ఒక్కో చదరపు అడుగు రూ.9 లక్షలకు విక్రయించినట్లయింది. ఈ ఏడాది విక్రయించిన అత్యంత ఖరీదైన ఇల్లు ఇది.
ఇప్పటిదాకా అమ్ముడైన టాప్-5 ఖరీదైన ఇళ్లలో ఇదీ ఒకటిగా చేర్చొచ్చు. లండన్లో అయితే ఇంతకంటే ఖరీదైన ఇల్లు లేదని లోధా యూకే సహా సీఈఓ గేబ్రియల్ యార్క్ పేర్కొన్నారు. ఒకప్పుడు అమెరికన్ ఎంబసీ ఈ భవంతిలోనే ఉంది. అమెరికా అంబాసిడర్ హోదాలో 1785 ప్రాంతంలో జాన్ ఆడమ్స్(అమెరికా రెండో అధ్యక్షుడు)ఇందులోనే నివసించారు. అంతేకాదు ఇది ప్రపంచ ప్రఖ్యాత ఓవర్ ఆఫీసుకు ప్రతిబింబంగా ఉండేది. 2014లో ఈ నం.1 గ్రోస్వీనర్ స్క్వేర్ను లోధా గ్రూప్ కొనుగోలు చేసింది. 39 అపార్టుమెంట్లు, అయిదు డూప్లెక్స్లను అభివృద్ధి చేసింది .