ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద 28.68లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు కేంద్రం తెలిపింది. వీరికి సుమారు రూ. 14.96లక్షల కోట్లు మేర రుణం మంజూరు చేసినట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని బ్యాంకింగ్, బ్యాంకింగేతర, మైక్రో ఫినాస్స్ సంస్థల నుంచి ఇచ్చినట్లు వెల్లడించింది.
"సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యాపార ఔత్సాహికుల నుంచి రైతుల వరకు అర్హులైన అందరికీ ఈ పథకం కింది లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా అడుగులు వేస్తోంది."
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ