తెలంగాణ

telangana

ETV Bharat / business

ముద్ర రుణాలు @రూ. 15లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద ఇప్పటి వరకు రూ. 14.96 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపింది. ఈ రుణాల ద్వారా 28.68 లక్షల మంది లబ్ధిపొందారని స్పష్టం చేసింది.

By

Published : Apr 7, 2021, 1:47 PM IST

Loans of Rs 14.96 lakh crore sanctioned since launch of PM Mudra scheme
'ముద్ర పథకం కింది రూ.14.96 లక్షల కోట్లు విడుదల'

ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద 28.68లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు కేంద్రం తెలిపింది. వీరికి సుమారు రూ. 14.96లక్షల కోట్లు మేర రుణం మంజూరు చేసినట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని బ్యాంకింగ్​, బ్యాంకింగేతర, మైక్రో ఫినాస్స్​ సంస్థల నుంచి ఇచ్చినట్లు వెల్లడించింది.

"సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యాపార ఔత్సాహికుల నుంచి రైతుల వరకు అర్హులైన అందరికీ ఈ పథకం కింది లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా అడుగులు వేస్తోంది."

- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ఎన్నో లక్షల మంది కన్న కలలు నెరవేరాయని, మరెంతో మంది ఆశయాలకు, ఆకాంక్షలకు రెక్కలు వచ్చాయని ఆర్థికశాఖ తెలిపింది. లబ్ధిదారులకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని పేర్కొంది.

ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్​ 8న ప్రారంభించారు. నాన్​ కార్పొరేటు సంస్థలకు, వక్తులకు,చిన్న, మధ్య తరగతి ఔత్సాహికులకు రూ.10 లక్షల వరకూ రుణం అందిస్తోంది కేంద్రం.

ఇదీ చూడండి:కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్​బీఐ

ABOUT THE AUTHOR

...view details