తీవ్రమైన కొవిడ్-19 వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రి పాలైన వారికి వైద్యులు సిఫారసు చేస్తున్న 'రెమ్డెసివిర్' ఔషధాన్ని ట్యాబ్లెట్ లేదా క్యాప్సూల్ రూపంలో తయారు చేసేందుకు దేశీయ ఔషధ కంపెనీ జుబిలెంట్ ఫార్మోవా లిమిటెడ్ ప్రయత్నాలు చేస్తోంది. జుబిలెంట్ ఫార్మోవాకు అనుబంధ సంస్థ అయిన జుబిలెంట్ ఫార్మా, ఇప్పటికే ఈ ఔషధాన్ని జంతువుల్లో, ఆరోగ్యంగా ఉన్న వలంటీర్లపైనా పరీక్షించింది. ఈ ఔషధాన్ని నోటి ద్వారా ఇచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని జుబిలెంట్ ఫార్మోవా వెల్లడించింది.దీనిపై తదుపరి అధ్యయనాల నిమిత్తం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి కోరింది.
ఇవీ ప్రయోజనాలు
అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ నుంచి లైసెన్సు ఒప్పందంతో మనదేశానికి చెందిన ఏడు ఫార్మా కంపెనీలు 'రెమ్డెసివిర్' ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో ప్రస్తుతం తయారు చేస్తున్నారు. అందులో జుబిలెంట్ ఫార్మోవా ఒకటి. ఈ కంపెనీలన్నీ ఐవీ ఫ్లూయిడ్ రూపంలో ఇచ్చే ఇంజెక్షన్ మాదిరిగా ఈ మందును తయారు చేస్తున్నాయి. రోగికి ఈ మందు ఇవ్వాలంటే ప్రస్తుతం తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాల్సిందే. అదే ట్యాబ్లెట్ లేదా క్యాప్సూల్స్ మాదిరిగా ఈ మందు వస్తే, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. వైద్యులు సిఫారసు చేస్తే, బాధితులే నేరుగా ట్యాబ్లెట్/క్యాప్సూల్ తీసుకోవచ్చు. ఇందువల్ల ఆసుపత్రి పడక దొరకని బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. పెద్దఎత్తున తయారు చేసి ఔషధానికి కొరత లేకుండా చూడొచ్చు. అందువల్ల ఈ విషయంలో జుబిలెంట్ ఫార్మా పరిశోధనలకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.
తక్కువ ధరలోనే అందించవచ్చు