తెలంగాణ

telangana

ETV Bharat / business

'టైమ్​' జాబితాలో రెండు భారతీయ సంస్థలు - time magazine latest news

టైమ్‌ మేగజైన్‌ ప్రకటించిన వంద అత్యంత ప్రభావవంతమైన సంస్థల జాబితాలో.. జియో ప్లాట్‌ఫామ్స్‌, బైజూస్‌ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. సమాజంపై ప్రభావం, ఆవిష్కరణ, నాయకత్వం వంటి కీలకమైన అంశాల ఆధారంగా టైమ్​ ఈ జాబితాను ప్రకటించింది.

jio and byju's
'టైమ్​' జాబితాలో ఆ రెండు భారతీయ సంస్థలు

By

Published : Apr 28, 2021, 4:43 PM IST

ప్రతిష్ఠాత్మక టైమ్‌ మేగజైన్‌ ప్రకటించిన వంద అత్యంత ప్రభావవంతమైన సంస్థల జాబితాలో.. రెండు భారతీయ సంస్థలకు స్థానం దక్కింది. రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌, ఈ లెర్నింగ్‌ అంకుర సంస్థ బైజూస్‌.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆరోగ్య సంరక్షణ, వినోదం, రవాణా, సాంకేతికత సహా పలు రంగాల నుంచి నామినేషన్లు ఆహ్వానించిన టైమ్‌ ఈ సంస్థలను ఎంపిక చేసింది. సమాజంపై ప్రభావం, ఆవిష్కరణ, నాయకత్వం, ఆశయం, విజయం లాంటి కీలకమైన అంశాలను మూల్యాంకనం చేసి ఈ జాబితాను​ ప్రకటించింది.

కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అతి తక్కువ రేట్లకు ఇంటర్నెట్ సేవలను జియో అందిస్తోందని కొనియాడిన టైమ్‌.. కరోనా వ్యాప్తి సమయంలో బైజూస్‌ అద్భుతాలు సృష్టించిందని తెలిపింది. ఈ జాబితాలో జూమ్, అడిడాస్, టిక్‌టాక్, ఐకియా, మోడెర్నా, నెట్‌ఫ్లిక్స్‌ వంటి సంస్థలకు కూడా చోటు దక్కింది. టైమ్‌ మేగజైన్‌ మొట్టమొదటి సారిగా ప్రకటించిన ప్రభావవంతమైన సంస్థల జాబితాలో భారత సంస్థలకు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details