కృత్రిమ మేధ (ఏఐ)- విద్య, ఉద్యోగావకాశాలు అనే అంశంపై ఈనాడు- హైసియా సంయుక్తంగా వెబినార్ నిర్వహించనున్నాయి. ఈ నెల 9న (శుక్రవారం), ఉదయం 11.00 గంటలకు వెబినార్ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగార్జనకు ఎంతో ప్రాధాన్యం గల ఈ అంశంపై నిపుణులు తమదైన విశ్లేషణ అందించనున్నారు.
హైసియా సంయుక్తంగా కృత్రిమ మేథపై ఈనాడు వెబినార్ - జయేష్ రంజన్ లేటెస్ట్ వార్తలు
కృత్రిమ మేధ (ఏఐ)- విద్య, ఉద్యోగావకాశాలు అనే అంశంపై ఈనాడు- హైసియా సంయుక్తంగా ఈ నెల 9న వెబినార్ నిర్వహించనున్నాయి. ఆసక్తి గలవారు పేర్ల నమోదు, వివరాల కోసం www.eenadu.net చూడండి.
![హైసియా సంయుక్తంగా కృత్రిమ మేథపై ఈనాడు వెబినార్ jayesh ranjan at eenadu webinar on artificial intelligence with hysea](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9079396-948-9079396-1602042937665.jpg)
హైసియా సంయుక్తంగా కృత్రిమ మేథపై ఈనాడు వెబినార్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్, హ్యూసిస్ వ్యవస్థాపకుడు, సీఈఓ జీఆర్ రెడ్డి, ఐఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్ ఈ వెబినార్లో మాట్లాడతారు. ఇన్సైడ్వ్యూ టెక్నాలజీస్ ఇంక్ బోర్డ్మెంబర్ శేషారావు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.ఆసక్తి గలవారు పేర్ల నమోదు, వివరాల కోసం www.eenadu.net చూడండి.