తెలంగాణ

telangana

ETV Bharat / business

పిక్సెల్ 4ఏ రాకతో ఆ ఫోన్లకు గూగుల్ గుడ్​బై - గూగుల్ లేటెస్ట్ స్మార్ట్​ఫోన్​

పిక్సెల్ 3 శ్రేణి ఫోన్లకు గుడ్​బై చెప్పింది గూగుల్​. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. త్వరలోనే గూగుల్ నుంచి పిక్సెల్ 4ఏ మోడల్​ విడుదల కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

google ends pixel 3 phones
పిక్సెల్ 3 ఫోన్లకు గూగుల్​ గుడ్​బై

By

Published : Jul 4, 2020, 5:40 PM IST

మిడ్​రేంజ్ సెగ్మెంట్​లో తీసుకువచ్చిన పిక్సెల్ 3 శ్రేణి ఫోన్లకు గుడ్​బై చెప్పింది గూగుల్. త్వరలో పిక్సెల్​ 4ఏ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తమ స్టోర్లలోనూ పిక్సెల్ 3 శ్రేణి ఫోన్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది గూగుల్. అయితే థర్డ్​ పార్టీ స్టోర్లలో మాత్రం.. స్టాక్ అయిపోయే వరకు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.

నిజానికి పిక్సెల్ 3ఏ నిలిపివేతతోనే.. పిక్సెల్​ 3 శ్రేణి ఫోన్ల ప్రస్థానం ముగిసింది. ఈ ఏడాది మార్చి నుంచి పిక్సెల్​ 3, 3 ఎక్స్​ఎల్​లను నిలిపివేసింది సంస్థ. ప్రస్తుతం గూగుల్​కు చెందిన ఫోన్లలో పిక్సెల్​ 4, 4 ఎక్స్​ఎల్​లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

త్వరలోనే పిక్సెల్ 4 శ్రేణిలో.. పిక్సెల్​ 4ఏ మోడల్​ను విడుదల చేసేందుకు గూగుల్ కసరత్తు చేస్తోంది.

పిక్సెల్ 4ఏ ఫీచర్లు, ధర అంచనాలు..

  • 5.81 అంగుళాల డిస్​ప్లే
  • 6జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్
  • స్నాప్​డ్రాగన్ 730 ప్రాసెసర్
  • ధర 399 డాలర్లు (సుమారు రూ.30 వేలు)

ఇదీ చూడండి:విండోస్ 10 యూజర్లకు అమెజాన్ ప్రైమ్ యాప్​

ABOUT THE AUTHOR

...view details