ఆదాయపు పన్ను శాఖ ఈ-అసెస్మెంట్ సిస్టమ్లో కీలక మార్పులు చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. అక్టోబర్ 8న ప్రారంభం కాబోయే ఈ విధానంలో ఇ-ఫైలింగ్ ఖాతా, పాన్ నెంబర్ లేనివారు ఈ-అసెస్మెంట్ సిస్టమ్లోకి ప్రవేశించలేరని స్పష్టం చేసింది.
ఐటీ దాడుల్లో కేసులు నమోదైనవారు, అసాధారణ పరిస్థితుల్లో... 'ఫేస్లెస్ అసెస్మెంట్ సిస్టమ్' పరిధిలోకిరారని సీబీడీటీ వెల్లడించింది.
సీబీడీటీ... ఆదాయపు పన్నుశాఖకు చెందిన పాలసీలను రూపొందిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఈ-అసెస్మెంట్లోని మినహాయింపులు తెలుపుతూ గురువారం సర్క్యులర్ విడుదల చేసింది.ట్రాయ్: 'పోర్టబిలిటీ' అమలు గడువు పొడిగింపు
వీరికి మినహాయింపులు..
పేపర్ మోడ్లో ఆదాయపు పన్ను రిటర్న్లు (ఐటీఆర్) దాఖలు చేసిన కేసుల్లో... ఈ-ఫైలింగ్ ఖాతా, పాన్ నెంబర్లేని ఆదాయపు పన్ను చెల్లింపుదారుల విషయంలో... కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని సీబీడీటీ స్పష్టం చేసింది. పాలనాపరమైన ఇబ్బందులు, సంక్షిష్ట కేసులు, కొన్ని అసాధారణ పరిస్థితులు ఉన్న సందర్భాల్లో... ఈ కొత్త వ్యవస్థ నుంచి మినహాయింపులు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ఐటీ దాడులు-శోధన జరుగుతున్న కేసుల్లో, విచారణ జరుగుతున్న మునుపటి కేసుల విషయంలోనూ మినహాయింపులు వర్తిస్తాయని సీబీడీటీ పేర్కొంది.
ఇలా చేయాలి..