భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఆన్లైన్లో బస్ టికెట్ల బుకింగ్ను ప్రవేశపెట్టింది. ఈ బస్ టికెట్ల బుకింగ్ వెబ్సైట్ జనవరి 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. "కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ సారథ్యంలో ఐఆర్సీటీసీ వన్ స్టాప్ షాప్ ట్రావెల్ పోర్టల్గా అభివృద్ధి చెందుతోంది. అన్ని రకాల ప్రయాణాలకు ఒకే వేదికను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఐఆర్సీటీసీలో ఇప్పటికే ఆన్లైన్ రైలు, విమాన టికెట్లు బుక్ చేసుకొనే అవకాశముంది. అదే బాటలో జనవరి 29, 2021 నుంచి బస్ టికెట్లను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొనే అవకాశాన్ని ప్రజలకు అందిస్తోంది" అని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సర్వీసులను ఫోన్లలో వినియోగించుకొనేందుకు ఐఆర్సీటీసీ యాప్లో తగిన మార్పులు చేస్తున్నట్లు వారు ఆ ప్రకటనలో తెలిపారు. మార్చి మొదటి వారంలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.