తెలంగాణ

telangana

ETV Bharat / business

మదుపరుల సంపద రూ.3.52 లక్షల కోట్లు వృద్ధి - బీఎస్​ఈ కంపెనీల మొత్తం విలువ

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది. దీనితో మదుపరుల సంపద భారీగా పెరిగింది. బీఎస్​ఈ లిస్టెడ్ కంపెనీల సంపద ఒక్క రోజే రూ.3.52 లక్షల కోట్లకుపైగా పెరిగినట్లు తెలిసింది.

STOCK INVESTORS WEALTH RISE
భారీగా పెరిగిన బీఎస్​ఈ మదుపరుల సంపద

By

Published : Sep 25, 2020, 6:55 PM IST

ఆరు రోజుల పాటు నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీగా పుంజుకున్నాయి. దీనితో మదుపరుల సంపద శుక్రవారం ఒక్క రోజే రూ.3.52 లక్షల కోట్లు పెరిగింది.

శుక్రవారం సెషన్​లో సెన్సెక్స్ 2.28 శాతం పెరిగింది. దీనితో బీఎస్​ఈ లిస్టెడ్ కంపెనీల సంపద రూ.3,52,020.53 కోట్లు పెరిగింది. మొత్తం సంపద రూ.1,52,28,237.75 కోట్లకు చేరింది.

బీఎస్​ఈ లిస్టెడ్ కంపెనీల్లో శుక్రవారం 1,988 సంస్థలు లాభాలను నమోదు చేశాయి. 660 కంపెనీలు నష్టపోయాయి. 170 కంపెనీలు స్తబ్తుగా సెషన్ ముగించాయి.

ఇదీ చూడండి:ఆరు రోజుల నష్టాలకు బ్రేక్- వారాంతంలో బుల్​ జోరు

ABOUT THE AUTHOR

...view details