తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2020, 11:10 AM IST

Updated : Jul 3, 2020, 2:10 PM IST

ETV Bharat / business

జియోలో మరో విదేశీ సంస్థ పెట్టుబడులు

జియో ప్లాట్​ఫామ్స్​లో 0.39 శాతం వాటాను రూ.1894.50 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఇంటెల్ క్యాపిటల్ ప్రకటించింది. తాజా పెట్టుబడితో జియోకు వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ. లక్షా 17 వేల 588 కోట్లకు చేరాయి.

Intel Capital to buy 0.39 pc stake in Jio Platforms for Rs 1,894 cr
జియోలో ఇంటెల్ క్యాపిటెల్ రూ.1984 కోట్ల పెట్టుబడి

జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎలక్ట్రానిక్ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఇన్వెస్ట్​మెంట్​కు చెందిన 'ఇంటెల్ క్యాపిటెల్'.​.. జియో ప్లాట్​ఫామ్స్​లో 0.39 శాతం వాటాను రూ.1,894.50 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటి వరకు జియో ప్లాట్​ఫామ్స్​లో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో ఇంటెల్ క్యాపిటల్ 12వది. తాజా పెట్టుబడితో జియోకు వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.1,17,588.45 కోట్లకు చేరాయి.

"జియో ప్లాట్​ఫామ్స్ అద్భుతమైన ఇంజినీరింగ్ సామర్థ్యాలను వినియోగిస్తూ.. తక్కువ ఖర్చుతో డిజిటల్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాయి."

- వెండెల్ బ్రూక్స్​, ఇంటెల్ క్యాపిటల్ ప్రెసిడెంట్​

జియో ప్రణాళిక..

2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25 శాతం మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో... జియోలో వాటా విక్రయాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో జియో ప్లాట్​ఫామ్స్ ఉన్నాయి. భారత్​ మార్కెట్​లో 38.8 కోట్ల మంది చందాదారులతో జియో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

జియోలో విదేశీ సంస్థల పెట్టుబడులు

ఇదీ చూడండి:గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవ్యాక్సిన్​!

Last Updated : Jul 3, 2020, 2:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details