భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ సెప్టెంబర్ త్రైమాసికంలో భారీగా పుంజుకుంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 17 శాతం వృద్ధితో 5.43 కోట్ల షిప్మెంట్లు నమోదైనట్లు అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదికలో వెల్లడైంది. చైనా, అమెరికా మార్కెట్లలో స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు తగ్గినప్పటికీ భారత్లో మాత్రం వృద్ధి నమోదు కావడం విశేషమని నివేదిక పేర్కొంది.
క్యూ3లో స్మార్ట్ఫోన్ మార్కెట్ 17 శాతం వృద్ధి! - స్మార్ట్ఫోన్ మార్కెట్లో షియోమీ వాటా
భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ ఈ ఏడాది(2019తో పోలిస్తే) మూడో త్రైమాసికంలో 17 శాతం వృద్ధి సాధించింది. ఇతర ప్రధాన స్మార్ట్ఫోన్ మార్కెట్లైన చైనా, అమెరికాల్లో విక్రయాలు పడిపోయినా.. దేశీయంగా మాత్రం వృద్ధి నమోదవ్వడం విశేషం. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్పై ఐడీసీ నివేదిక వెల్లడించిన మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబర్లో పెరిగిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు
నివేదికలోని ముఖ్యాంశాలు..
- సెప్టెంబర్ త్రైమాసికంలో షియోమీ 25 మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. శాంసంగ్ (22.3 శాతం), వీవో (16.7 శాతం), రియల్మీ (14.7 శాతం), ఒప్పో (11.3 శాతం)లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- పండుగ సీజన్ నేపథ్యంలో పెరిగిన డిమాండ్, స్టాక్స్ నిల్వపెట్టుకోవడం వల్ల ఈ స్థాయిలో షిప్మెంట్లు నమోదయ్యాయి.
- సెప్టెంబర్ త్రైమాసికంలో 2.5 కోట్ల ఫీచర్ ఫోన్ల షిప్మెంట్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇవి 30 శాతం తక్కువ.
- వార్షిక ప్రాతిపదికన మాత్రం షిప్మెంట్లలో వృద్ధి సింగిల్ డిజిట్కు పరిమితం కావచ్చు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ప్రథమార్ధంలో నమోదైన క్షీణత ఇందుకు కారణం.
- మొబైల్ ఫోన్ల విక్రయాలలో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాటా 48 శాతం వద్ద జీవిత కాల గరిష్ఠానికి చేరింది. ఈ కామర్స్ సంస్థల ప్రమోషన్లు, ప్రత్యేక సేల్స్ ఇందుకు కారణమయ్యాయి.
- ప్రథమార్ధంలో సవాళ్లు ఎదురైన తర్వాత.. ఆఫ్లైన్ మార్కెట్లో 11 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఆఫ్లైన్ మార్కెట్కు సరఫరా సమస్యను ఎదుర్కొంటోంది.
Last Updated : Nov 7, 2020, 6:25 AM IST