కరోనా మహమ్మారి కారణంగా దేశీయ మీడియా, వినోద రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటి ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. అయితే.. వినియోగాదారులు డిజిటల్ వైపు వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో 2021-22 ఆర్థిక ఏడాదిలో ఈ రంగం పుంజుకుంటుందని, ఆదాయం రూ.1,86,600 కోట్లకు చేరుకుంటుందని తాజాగా ఓ సంస్థ అంచనా వేసింది.
ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంఅండ్ఈ సెక్టార్ పనితీరును అంచనా వేసి 'ఎ ఇయర్ ఆఫ్ స్క్రిప్ట్: టైమ్ ఫర్ రెసిలియన్స్' అనే నివేదికను రూపొందించింది కేపీఎంజీ ఇండియా. వచ్చే ఆర్థిక ఏడాదిలో 33 శాతం వృద్ధి నమోదు చేస్తుందని కేపీఎంజీ భారత్ అధినేత గిరీశ్ మేనన్ తెలిపారు.
" భారత ఆర్థిక వ్యవస్థ నిరంతర వృద్ధికి, వినియోగదారులు డిజిటల్ వైపు మళ్లేందుకు ఈ రెండు రంగాలు ప్రోత్సహిస్తాయి. మా సవరించిన అంచనాల ప్రకారం.. 2028 నాటికే భారత్లో ఒక బిలియన్ డిజిటల్ వినియోగదారులు ఉంటారు. అది గతంలో 2030 వరకు అని అంచనా వేశారు."