తెలంగాణ

telangana

పండుగ సీజన్​లో తగ్గిన చైనా ఉత్పత్తుల కొనుగోళ్లు!

By

Published : Nov 17, 2020, 11:09 AM IST

గత కొంత కాలంగా బాయ్​కాట్ చైనా ఉద్యమం కొనసాగుతోంది. ఈ ప్రభావం పండుగ విక్రయాలపై భారీగా పడినట్లు ఓ సర్వేలో తేలింది. ఈ సారి పండుగ సీజన్​లో 29 శాతం మంది వినియోగదారులు మాత్రమే చైనా ఉత్పత్తులు కొనుగోలు చేశారని లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది.

Boycott China influence on festival sales
చైనా వస్తువులపై బాయ్​కాట్ చైనా ప్రభావం

చైనా వస్తువులపై దేశంలో గత కొంత కాలంగా వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా జూన్​లో గల్వాన్​ లోయలో.. 20 మంది భారత సైనికులను చైనా ఆర్మీ అక్రమంగా పొట్టనబెట్టుకున్న తర్వాత.. బాయ్​కాట్​ చైనా ఉద్యమం ఊపందుకుంది. ఈ ప్రభావం పండుగ సీజన్ విక్రయాలపైనా పడింది. ఈ సారి పండుగ సీజన్​లో 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు ఓ సర్వేలో తేలింది. గత ఏడాది పండుగ సీజన్​లో 48 శాతం మంది చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు ఈ సర్వే పేర్కొంది. నవంబర్ 10నుంచి 15 మధ్య దేశవ్యాప్తంగా 204 పట్టణాల్లో జరిగిన సర్వేలో 14 వేల మందికిపైగా పాల్గొన్నారు.

లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన 29 శాతం మందిలో.. 71 శాతం మంది తాము చైనా వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు అవగాహన లేదని వెల్లడించారు. 66 శాతం డబ్బుకు విలువనిచ్చేందు ఈ చైనా వస్తువులను కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు.

మొత్తం వినియోగదారుల్లో 87 శాతం మంది ఏడాది వరకు చైనా ఉత్పత్తులను బహిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

చైనా ఉత్పత్తులకు పోటీగా ఉన్న భారత వస్తువుల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు వినియోగదారులు. అయితే భారతీయ వస్తువులు నాణ్యతలో చైనా కన్నా మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఎల్​ఈడీ లైట్లు, కొవ్వొత్తులు, ప్లాస్టిక్​ వస్తువుల వంటి ఒకసారి వాడిపడేసే వస్తువులను తక్కువ ధరలో కొనేందుకే మొగ్గుచూపారు.

ఇదీ చూడండి:ధరల చివర '99' కథేమిటో తెలుసా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details