తెలంగాణ

telangana

By

Published : Dec 30, 2019, 7:30 AM IST

ETV Bharat / business

2020లో ఆర్థికవ్యవస్థ పుంజుకునే అవకాశం: సీఐఐ

మందగమనంలో ఉన్న భారత ఆర్థికవ్యవస్థ నూతన సంవత్సరంలో కోలుకునే అవకాశం ఉందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. అంతర్జాతీయ సానుకూలతలకు తోడు కేంద్ర ప్రభుత్వం, ఆర్​బీఐ తగిన చర్యలు చేపడుతుండడమే ఇందుకు కారణమని విశ్లేషించింది.

Indian economy likely to rebound in 2020: CII
2020లో ఆర్థికవ్యవస్థ పుంజుకునే అవకాశం: సీఐఐ

2020లో భారత ఆర్థికవ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని 'భారత పరిశ్రమల సమాఖ్య' (సీఐఐ) అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం సహా భారత ప్రభుత్వం, ఆర్​బీఐ తగిన చర్యలు చేపడుతుండడమే ఇందుకు కారణమని సీఐఐ విశ్లేషించింది.

"నూతన సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ కోలుకుంటుందనే సంకేతాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వం, ఆర్​బీఐ తీసుకుంటున్న చర్యల వల్ల పరిశ్రమలు క్రమక్రమంగా మందగమనం నుంచి కోలుకుంటాయి."- భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)

పుంజుకుంటాయ్​..

సీఐఐ కేంద్ర ప్రభుత్వానికి ఓ సౌకర్యవంతమైన ఆర్థిక విధానాన్ని సూచించింది. దీని వల్ల ద్రవ్యలోటును 0.5 నుంచి 0.75 శాతం మధ్య నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడింది. ఇందుకోసం మౌలిక సదుపాయాల కల్పనను తొందరగా చేయాల్సిన అవసరమూ ఉందని తెలిపింది.

తయారీ, సేవల రంగాలు మెరుగైన 'పీఎమ్​ఐ'ల (కొనుగోలు నిర్వహాకుల సూచిక) రూపంలో పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయని సీఐఐ తెలిపింది. ప్రయాణికుల కార్ల అమ్మకాలు క్షీణించడం, విమాన ప్రయాణాలు పుంజుకోవడం ఇందుకు నిదర్శనమని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్​ కిర్లోస్కర్​ అన్నారు. 2019 మూడో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటులో క్షీణత కొనసాగినప్పటికీ.. త్వరలోనే అది పుంజుకునే అవకాశం ఉందని విక్రమ్ అభిప్రాయపడ్డారు.

భవిష్యత్​పై ఆశలున్నాయ్​

జీఎస్టీ, దివాలా స్మృతిల అమలుతో ప్రారంభంలో పరిశ్రమలకు ఎదురైన ఇబ్బందులు క్రమక్రమంగా తగ్గుతున్నాయని, భవిష్యత్​లో ఇది ఆర్థికవ్యవస్థకు గణనీయమైన ప్రయోజనాలు చేకూర్చుతుందని సీఐఐ ఆశాభావం వ్యక్తం చేసింది.

తాత్కాలికమే

కేంద్రప్రభుత్వం 2019లో ఆర్థికరంగాన్ని క్రమబద్ధీకరించే, శుభ్రపరిచే చర్యలు చేపట్టిందని, ఇది 'స్వల్పకాలికంగా ఇబ్బందులు' కలిగించినా ఆర్థికవ్యవస్థకు సమీపకాలంలో విస్తృతమైన ప్రయోజనం చేకూరుస్తుందని సీఐఐ అభిప్రాయపడింది. కనుక 2020లో భారత ఆర్థికవ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందని అంచనా వేసింది. విస్తరణ ఆర్థిక విధానాన్ని అవలంభించాల్సిన సమయం కూడా ఆసన్నమైందని పేర్కొంది.

జీఎస్టీ శ్లాబులను కుదించాలి..

అందరి సమ్మతితో పన్ను రేట్లను పెంచేందుకు ముందుగా.. జీఎస్టీలోని 4 శ్లాబుల విధానాన్ని కుదించాల్సిన అవసరముందని సీఐఐ సూచించింది. అలాగే జీఎస్టీ కౌన్సిల్ తరచుగా జీఎస్టీ రేట్లు సమీక్షించే పద్ధతిని నిలిపివేయాలని తెలిపింది. కస్టమ్స్ సుంకాన్ని హేతుబద్ధీకరించాలని అభిప్రాయపడింది.

ముడిపదార్థాలపై అతితక్కువ, ఇంటర్మీడియట్​ వస్తువులపై తక్కువ, తుది ఉత్పత్తులపై అధిక కస్టమ్స్​ సుంకం సూత్రాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా పాటించాల్సి ఉందని సీఐఐ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:రివ్యూ 2019: ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు పరుగో పరుగు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details