తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2021, 4:47 PM IST

ETV Bharat / business

ఆ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు!

కరోనా వల్ల గత ఏడాది ఉద్యోగుల వేతనాల పెంపును పక్కనబెట్టడం లేదా భారీగా తగ్గించడం వంటివి చేశాయి కంపెనీలు. అయితే ఇప్పుడిప్పుడే వ్యాపారాలు కుదుటపడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది వేతనాల పెంపు సానుకూలంగా ఉండొచ్చని ఓ సర్వే వెల్లడించింది. సగటున 6.4 శాతం చొప్పున ఈ ఏడాది వేతనాల పెంపు ఉండొచ్చని తెలిపింది.

High salary increments in this year
ఈ ఏడాది భారీగా వేతనాల పెంపు

భారత్​లో ఉద్యోగులకు ఈ ఏడాది సగటున 6.4 శాతం చొప్పున వేతనాల పెంపు ఉండొచ్చని ఓ సర్వే వెల్లడించింది. ఇది 2020లో 5.9 శాతంగా ఉండటం గమనార్హం. విల్లీస్​ టవర్స్​ వాట్సన్ అనే​ సంస్థ చేసిన ఈ సర్వేలో వేతనాలపెంపుపై పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

'కొవిడ్ 19 వల్ల ఏర్పడిన పరిస్థితులకు తగ్గట్లు భారతీయ కంపెనీలు ప్రతిస్పందిస్తున్నందున.. వ్యాపారాల రికవరీ అశాజనకంగా ఉంది. అయితే ఆ సానుకూలతలు వేతనాల పెంపునకూ రావాల్సి ఉంది.' అని విల్లీస్​ టవర్స్​ వాట్సన్ ఇండియా ప్రతినిధి రాహుల్ మాథుర్​ అన్నారు. గత ఏడాది కన్నా కాంపెన్​సేషన్ బడ్జెట్​ తక్కువగా ఉండడం వల్ల.. కంపెనీలు ఎక్కువ నైపుణ్యాలున్న వారికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముందని తెలిపారు.

సర్వే ముఖ్యాంశాలు..

ఈ ఏడాది అధిక నైపుణ్యాలున్న 10.3 శాతం ఉద్యోగులకు(దేశవ్యాప్తంగా) 20.6 శాతం వేతనాల పెంపు ఉండొచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఓ మోస్తరు పనితీరు కనబర్చే ఉద్యోగులకు రూ.1 కేటాయిస్తే..టాప్​ పర్​ఫార్మర్​కు రూ.2.35, మోస్తరు కన్నా కాస్త ఎక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగులకు రూ.1.25 చొప్పున ఈ ఏడాది కేటాయింపులు ఉండొచ్చు.

ఎగ్జిక్యూటివ్​ స్థాయిలో ఈ ఏడాది వేతన పెంపు.. గత ఏడాదితో పోలిస్తే 7.1 శాతం నుంచి 7 శాతానికి తగ్గొచ్చు.

మిడిల్​ మేనేజ్​మెంట్, వృత్తి నిపుణులు, సపోర్ట్ స్టాఫ్​కూ ఈ ఏడాది వేతనాలు 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గే అవకాశాలున్నాయి.

రంగాల వారీగా చూస్తే.. టెక్​, ఫార్మా, ఎఫ్​ఎంసీజీ రంగాల్లో వేతనాలు దాదాపు 8 శాతం పెరగొచ్చు.

ఆర్థిక సేవల విభాగంలో 7 శాతం, బీపీఓ రంగంలో 6 శాతం చొప్పున విద్యుత్​ రంగంలో అత్యల్పంగా 4.6 శాతం వేతనాల పెంపునకు అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:కొత్త ఏడాదిలో జోరుగా వాహన విక్రయాలు

ABOUT THE AUTHOR

...view details