తెలంగాణ

telangana

ETV Bharat / business

కళతప్పిన స్మార్ట్​ఫోన్​ మార్కెట్.. మళ్లీ పండగలతోనే జోష్​! - smartphone market latest news

కరోనా సంక్షోభం భారతీయ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​పైనా ప్రభావం చూపింది. ఈ వైరస్​ వచ్చిన తర్వాత దాదాపు 50 శాతం అమ్మకాలు తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అయితే రానున్న కాలంలో వరుస పండుగల వల్ల మళ్లీ మార్కెట్​ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఐడీసీ ఇండియా.

India smartphone market set to recover in festive season: Report
కళతప్పిన స్మార్ట్​ఫోన్​ మార్కెట్.. మళ్లీ పండగతోనే జోష్​!

By

Published : Aug 8, 2020, 9:44 PM IST

కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోయాయి. భారత్​లోనూ ఈ వైరస్​ అడుగుపెట్టాక స్మార్ట్​ఫోన్​ మార్కెట్ సేల్స్​​ సగానికి పడిపోయాయి. లాక్​డౌన్​ వల్ల ఏప్రిల్​-జూన్​ కాలంలో షిప్​మెంట్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయని.. అయితే రానున్న కాలంలో పండుగ సీజన్​ కావడం వల్ల మళ్లీ వ్యాపారాలు పుంజుకుంటాయని అభిప్రాయపడింది మార్కెట్​ రీసెర్చ్​ సంస్థ ఇంటర్నేషనల్​ డేటా కార్పొరేషన్(ఐడీసీ) ఇండియా. ఈ మేరకు శుక్రవారం ఓ నివేదిక విడుదల చేసింది.

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన లాక్​డౌన్​ కారణంగా.. గతేడాది వ్యాపారంతో పోలిస్తే దాదాపు 50.6 శాతం తగ్గుదల నమోదైనట్లు ఆ నివేదిక తెలిపింది. దాదాపు 18.2 మిలియన్​ యూనిట్లు తక్కువగా అమ్ముడైనట్లు స్పష్టం చేసింది.

తొలి స్థానంలో శాంసంగ్​...

చైనాకు చెందిన స్టార్ట్​ ఫోన్ల తయారీ సంస్థ షియోమీకి షాకిచ్చింది దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్. భారత మొబైల్ ఫోన్ల మార్కెట్లో అగ్రస్థానంలో రారాజుగా వెలుగొందుతున్న షియోమీని.. శాంసంగ్ వెనక్కి నెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్​ మధ్య మొబైల్​ ఫోన్ల విక్రయాలకు సంబంధించి ఐడీసీ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

స్మార్ట్​ఫోన్ల సెగ్మెంట్​లో మాత్రం షియోమీ టాప్​లో నిలిచింది. 29.4 శాతం షేర్​తో ఈ చైనా సంస్థ అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉండే వివోను(17.5) వెనక్కి నెట్టి ఆ ర్యాంక్​ను ఆక్రమించుకుంది శాంసంగ్(26.3). రియల్​​ మీ 9.8 శాతం, ఒప్పో 9.7 శాతం మార్కెట్​ను కైవసం చేసుకున్నాయి. చైనా వస్తువుల బహిష్కరణ కారణంగా శాంసంగ్​ మార్కెట్​ దూసుకెళ్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లాక్​డౌన్​ దెబ్బ...

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ వల్ల సప్లై చైన్​లో ఇబ్బందులు ఎదుర్కొని విక్రేతలు డిమాండ్​కు తగ్గట్లు వస్తువులను అందించలేకపోయినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఫ్యాక్టరీలు కూడా సగం సిబ్బందితో పనిచేయడం మరో కారణంగా వెల్లడించింది. విడి పరికరాలు, మొబైల్ భాగాల రవాణా విషయంలోనూ సమస్యలు ఎదురైనట్లు స్పష్టం చేసింది. అయితే లాక్​డౌన్ సడలింపుల వల్ల జూన్​ నుంచి అమ్మకాల్లో జోరు పెరిగినట్లు తెలిపింది.

" 44.8 శాతం మార్కెట్​ షేర్​ ఆన్​లైన్​ ద్వారానే జరిగింది. అయితే ఇది గతేడాదితో పోలిస్తే 39.9 శాతం తక్కువ. లాక్​డౌన్​ ఆంక్షలు, డెలివరీ ఆలస్యం, తక్కువ ఉత్పత్తి వల్ల ఈ లోటు వచ్చింది" అని ఐడీసీ నివేదిక పేర్కొంది.

కొత్త విధానాలు..

చాలా మంది రిటైలర్లు కరోనా వల్ల కొత్త తరహా మార్కెటింగ్​ విధానాలను అందిపుచ్చుకున్నారని తెలిపింది ఐడీసీ. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్​, రిఫరెన్సులు వంటి వాటితో పాటు ఇంటివద్దే డెమో, డెలివరీ వంటి సదుపాయం, కాంటాక్ట్​లెస్​ పేమెంట్స్​తో వ్యాపారాలను కొనసాగించారని తెలిపింది. అయితే ఏప్రిల్​లో జీఎస్టీ పెరుగుదల వల్ల బ్రాండ్​ సంస్థలు వస్తువుల ధరలు పెంచినట్లు పేర్కొంది.

ప్రీమియం విభాగంలో 500 డాలర్లకు పైగా ధర ఉండే అమ్మకాల్లో.. గతేడాది కన్నా 35.4 శాతం లోటు నమోదైందని తెలిపింది. ఇందులో 48.8 శాతం షేర్​తో యాపిల్​ అగ్రస్థానంలో ఉండగా శాంసంగ్​, వన్​ ప్లస్​ వరుస స్థానాల్లో నిలిచాయి. ఫీచర్​ ఫోన్​ షిప్​మెంట్​ కూడా గతేడాది కన్నా 69 శాతం తగ్గినట్లు ఐడీసీ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details