తెలంగాణ

telangana

బ్రిటన్ ఎఫ్​డీఐలలో రెండో స్థానానికి భారత్

By

Published : Jul 11, 2020, 12:48 PM IST

బ్రిటన్​ విదేశీ పెట్టుబడుల్లో భారత్​ రెండో స్థానంలో నిలిచింది. 2019లో భారత్​ 120 ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టినట్లు బ్రిటన్ అధికారిక గణాంకాల్లో తెలిపింది. వీటి ద్వారా అక్కడ 5,429 కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు వెల్లడించింది.

Indian Investments In Uk
బ్రిటన్​లో పెరిగిన విదేశీ పెట్టుబడులు

బ్రిటన్​లో ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్న దేశాల్లో భారత్​ రెండో స్థానానికి ఎగబాకింది. 2019లో మన దేశం బ్రిటన్​లో 120 ప్రాజెక్ట్​లలో పెట్టుబడి పెట్టి.. 5,429 కొత్త ఉద్యోగాలు సృష్టించింది. బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలో ఈ విషయం వెల్లడైంది.

2018-19తో పోలిస్తే 2019-20లో బ్రిటన్​లో భారత్ పెట్టుబడులు 4 శాతం పెరిగినట్లు డిపార్ట్​మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (​డీఐటీ) తెలిపింది.

బ్రిటన్​లో ఎఫ్​డీఐలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 462 ప్రాజెక్ట్​లలో పెట్టుబడి ద్వారా 20,131 ఉద్యోగాలు కల్పించింది అమెరికా. ఈ జాబితాలో భారత్​ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, చైనా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లు ఉన్నాయి.

ఇదీ చూడండి:'గత వందేళ్లలో కరోనానే అతిపెద్ద సంక్షోభం'

ABOUT THE AUTHOR

...view details