తెలంగాణ

telangana

త్వరలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంగా రూ.35,000 కోట్లు!

జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాలకు రావాల్సిన 35,000 కోట్ల పరిహారాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రాల పన్ను ఆదాయం 14శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని కేంద్రం భరిస్తుంది.

By

Published : Feb 9, 2020, 2:59 PM IST

Published : Feb 9, 2020, 2:59 PM IST

Updated : Feb 29, 2020, 6:12 PM IST

Centre to release another Rs 35,000 cr compensation to states soon
త్వరలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారంగా రూ.35,000 కోట్లు!

జీఎస్టీ వసూళ్లలో ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు చెల్లించేందుకు....కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 35వేల కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రాల పన్ను ఆదాయం 14శాతం పెరగకుంటే ఆ నష్టాన్ని భరిస్తూ కేంద్రం అయిదేళ్ల పాటు పరిహారం చెల్లిస్తుంది. ఈ పరిహారం మొత్తం తగినంతగా ఉండడం లేదని రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి.

ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాలకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లో సుమారు 35వేల 3వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది. మరో 35వేల కోట్ల రూపాయలను సంచిత నిధి నుంచి రెండు విడతల్లో కేంద్రం విడుదల చేయనుంది. మొదటి విడత అక్టోబర్‌, నవంబర్‌ మాసాలకు సంబంధించి ఉండనుంది.

జీఎస్టీలో అత్యధికంగా వసూలయ్యే మొత్తాన్ని కేంద్రం గతంలో సంచిత నిధికి మళ్లించగా, ప్రస్తుతం నష్ట పరిహార నిధిలో జమ చేస్తోంది. 2017 జులైలో జీఎస్టీ అమలు ప్రారంభమైన నాటి నుంచి కేంద్రం జీఎస్టీ ఆదాయ నష్ట పరిహారంగా రాష్ట్రాలకు 2లక్షల 11వేల కోట్ల రూపాయలను చెల్లించింది.

ఇదీ చూడండి: వైఫై డబ్బా: ఒక్క రూపాయికే 1 జీబీ సూపర్​ఫాస్ట్ డేటా

Last Updated : Feb 29, 2020, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details