తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా రెండో నెలలోనూ లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు - వరుసగా 2 నెలలోనూ లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెలలోనూ రూ. లక్ష కోట్లు దాటాయి. 2019 డిసెంబర్​లో రూ.1,03,184 కోట్లుగా నమోదయ్యాయి.

GST revenue mop-up rises to Rs 1.03 lakh crores in December 2019
వరుసగా 2 నెలలోనూ లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

By

Published : Jan 1, 2020, 5:26 PM IST

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా రెండో నెలలోనూ లక్ష కోట్ల రూపాయలు దాటాయి. 2018 డిసెంబర్​లో రూ.97,276 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు.... 2019 డిసెంబర్​ నాటికి రూ.1.03 కోట్లకు పెరిగాయి. 2019 నవంబర్​లోనూ జీఎస్టీ రూ.1,03,492 కోట్లు వసూలైంది.

స్లాబుల వాటా

  • 2019 డిసెంబర్​లో మొత్తం వసూళ్లు: రూ.1,03,184 కోట్లు
  • కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ): రూ.19,962 కోట్లు
  • రాష్ట్ర జీఎస్టీ (ఎస్​జీఎస్టీ): రూ.26,792 కోట్లు
  • ఐజీఎస్​టీ రూ.48,099 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.21,295 కోట్లతో కలిపి)
  • సెస్​ రూ.8,331 కోట్లు(దిగుమతులపై వసూలు చేసిన రూ.847 కోట్లతో కలిపి).

16 శాతం వృద్ధి

2018 డిసెంబర్​తో పోలిస్తే... దేశీయ లావాదేవీలపై వసూలైన జీఎస్టీ 2019 డిసెంబర్​కు 16 శాతం పెరిగింది.

ఇదీ చూడండి: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details