తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫిబ్రవరిలో రూ.5వేల కోట్లు తగ్గిన జీఎస్టీ వసూళ్లు - జీఎస్టీ వసూళ్లు

జనవరితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు రూ.5వేల కోట్లు తగ్గాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.05 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూలు అయినట్లు కేంద్రం తెలిపింది. అయితే గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ రాబడి 8 శాతం పెరిగినట్లు పేర్కొంది.

GST revenue collection stood at Rs 1,05,366 crore in February
ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లు

By

Published : Mar 1, 2020, 8:48 PM IST

Updated : Mar 3, 2020, 2:20 AM IST

ఫిబ్రవరి నెలలో రూ.1.05 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూలు అయినట్లు కేంద్రం తెలిపింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ రాబడి 8 శాతం పెరిగినట్లు పేర్కొంది. అయితే ఈ ఏడాది జనవరి రాబడి (1.10 లక్షల కోట్లు) కంటే ఐదువేల కోట్లు తగ్గినట్లు వెల్లడించింది.

ఫిబ్రవరి నెలలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,366 కోట్లు ఉంటే... ఇందులో సీజీఎస్టీ రూ.20,569 కోట్లు, ఎస్​జీఎస్టీ రూ.27,348 కోట్లు, ఐజీఎస్టీ రూ.48,503 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే ఫిబ్రవరి నెలలో ప్రజల కొనుగోలు లావాదేవీలు 12 శాతం పెరిగినట్లు వివరించింది.

ఇదీ చూడండి:ఎస్​బీఐ కార్డు ఐపీఓ రేపే ప్రారంభం.. విశేషాలివే

Last Updated : Mar 3, 2020, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details