20ఏళ్ల పాటు డీటీహెచ్ ఆపరేటర్ల లైసెన్సులు తిరిగి పొడిగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది ప్రముఖ డీటీహెచ్ సంస్థ టాటా స్కై. ఈ నిర్ణయం డీటీహెచ్ పరిశ్రమకు మరింత చేయూతనందించే విధంగా ఉందని అభిప్రాయపడింది.
దేశంలో డీటీహెచ్ సేవలను అందించేందుకుగా రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తోన్న పలు కంపెనీలకు 20 ఏళ్ల పాటు లైసెన్సులను పొడిగించున్నారు. ఇప్పటివరకు అది పది సంవత్సరాల వరకు మాత్రమే ఉండేది.