మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి నెలవారీగా దాఖలు చేసే జీఎస్టీఆర్-3బీ చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలస్య రుసుమును మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. చెల్లించాల్సిన మొత్తాలపై వడ్డీరేటును కూడా తగ్గించినట్లు తెలిపింది.
రూ.5కోట్ల టర్నోవర్ కలిగిన పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జీఎస్టీఆర్-3బీని దాఖలు చేయడానికి 15 రోజుల అదనపు సమయాన్ని ఇచ్చింది. సాధారణంగా అయితే ఈ పక్షం రోజులకు 9శాతం ఆలస్య రుసుముని కేంద్రం వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ పై 18శాతం ఆలస్య రుసుమును కట్టాల్సి ఉంటుంది.