తెలంగాణ

telangana

ETV Bharat / business

పీఎఫ్​: రూ.5లక్షల డిపాజిట్​ వడ్డీపై పన్ను రద్దు! - ఆర్థికబిల్లుకు ఆమోదం

పీఎఫ్​ ఖాతాలకు సంబంధించి.. ఏడాదికి ఐదులక్షల రూపాయల మొత్తం వరకూ లభించే వడ్డీపై పన్నుమినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆర్థికబిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా యాజమాన్య చందాలేని పీఎఫ్ ఖాతాలకు సంబంధించి రూ.5లక్షల వరకూ వడ్డీపై పన్నుమినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్​ వెల్లడించారు.

Govt raises PF threshold limit to Rs 5 lakh for earning tax-free interest
రూ.5లక్షల వరకు పన్నురహితంగా పీఎఫ్​!

By

Published : Mar 23, 2021, 7:49 PM IST

ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమచేసే డిపాజిట్ పరిమితిని కేంద్రం ఏడాదికి ఐదు లక్షలకు పెంచింది. ఆ మొత్తంపై వచ్చే వడ్డీపై పన్నుమినహాయింపునిచ్చింది. అయితే రిటైర్మెంట్ ఫండ్‌కు యాజమాన్యం చందా లేని కేసుల్లోనే వర్తిస్తుందని తెలిపింది.

ఏడాదిలో ఉద్యోగుల పీఎఫ్ చందా రెండున్నర లక్షలు దాటితే పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఈ మేరకు ఆర్థిక బిల్లు 2021కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఫలితంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాయి. మూజువాణి ఓటుతో ఆమోదం బిల్లుకు 127 సవరణలు చేశారు. పీఎఫ్ ఖాతాలకు సంబంధించి వడ్డీలపై పన్ను కేవలం ఒకశాతం చందాదారులకు మాత్రమే వస్తారని వెల్లడించారు.

మిగతావారి పీఎఫ్ చందా, ఇంధనధరలపై అధిక పన్నులకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన నిర్మల.. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశమై వచ్చే జీఎస్టీ మండలిలో చర్చించేందుకు సిద్ధమన్నారు. అయితే ఇంధన ధరలపై పన్ను అంశం కేవలం కేంద్రం పరిధిలోనే లేదని రాష్ట్రాలకు సంబంధిచిన అంశమన్నారు

ఇదీ చదవండి:భారత్​ ఆశలకు కరోనా గండి- లక్ష్య సాధన మూడేళ్లు ఆలస్యం!

ABOUT THE AUTHOR

...view details