తెలంగాణ

telangana

ETV Bharat / business

అందుబాటు ధరలకు ఎరువులు- కేంద్రం హామీ - supply of fertilisers from the international market

ఖరీఫ్ సీజన్​కు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి సరైన ధరలకు ఫర్టిలైజర్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇందుకోసం దౌత్యమార్గాల ద్వారా చర్చలు జరుపుతామని వెల్లడించింది.

Govt promises diplomatic interventions to get P&K fertilisers imports at reasonable rates
అందుబాటు ధరలకు ఎరువులు- కేంద్రం హామీ

By

Published : Apr 14, 2021, 9:14 PM IST

ఫాస్పేటిక్, పొటాషిక్ ఫర్టిలైజర్లు అంతర్జాతీయ మార్కెట్ నుంచి సరసమైన ధరలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై దౌత్య మార్గాల ద్వారా ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ఫర్టిలైజర్ పరిశ్రమ వర్గాలకు హామీ ఇచ్చింది.

2021 ఖరీఫ్ సీజన్​కు ముందు ఎరువుల లభ్యతపై ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ నేతృత్వంలో ఏప్రిల్ 12న సమీక్ష సమావేశం జరిగింది. దేశంలో విరివిగా ఉపయోగించే డీఅమ్మోనియం ఫాస్పేట్ వంటి ఎరువుల ధరలను పెంచొద్దని పలు కంపెనీలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరాయి. అంతర్జాతీయంగా ముడి సరకుల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్​కు అన్ని ప్రాంతాల్లో ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా ప్రకటన విడుదల చేసింది. దిగుమతి చేసుకునే ఎరువుల ధరలపై ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది. రైతులకు సరైన సమయంలో, సరైన ధరకు ఎరువులను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:ఎరువుల ధరాఘాతం.. రైతులపై పిడుగు

ABOUT THE AUTHOR

...view details