తెలంగాణ

telangana

జీఎస్టీ లాటరీ.. రూ. కోటి వరకు గెలుచుకునే అవకాశం!

By

Published : Feb 4, 2020, 5:47 PM IST

Updated : Feb 29, 2020, 4:11 AM IST

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు పలుమార్గాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా వినియోగదారులు కొనుగోళ్లు చేసేటప్పుడు బిల్లులను తీసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం లాటరీ పద్ధతిలో రూ.10 లక్షల నుంచి కోటి వరకు అందించాలని యోచిస్తోంది.

Govt plans GST lottery offers of Rs 10 lakh-Rs 1 cr
జీఎస్టీ లాటరీ - రూ.10 లక్షల నుంచి కోటి వరకు గెలుచుకోవచ్చు!

వినియోగదారులు కొనుగోళ్లు చేసేటప్పుడు బిల్లులను తీసుకునేలా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచన చేస్తోంది. జీఎస్టీ చెల్లింపుదారులకు లాటరీ పద్ధతిలో రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని అందించాలని యోచిస్తోంది.

ప్రతి బిల్లూ పరిగణనలోకి

ప్రతి జీఎస్టీ చెల్లింపుదారుని బిల్లును లాటరీ పద్ధతి కోసం పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ (సీబీఐసీ) వర్గాలు తెలిపాయి. లాటరీ డబ్బును అక్రమాదాయ వ్యతిరేక కార్యకలాపాల ద్వారా నిర్వహిస్తున్న వినియోగదారుల సంక్షేమ నిధి నుంచి చెల్లిస్తామని వెల్లడించాయి.

"మేము సరికొత్త లాటరీ పద్ధతిని తీసుకొస్తున్నాము. దీనిలో ప్రతి జీఎస్టీ చెల్లింపుదారుని బిల్లును పరిగణనలోకి తీసుకుంటాం. కొనుగోలు బిల్లులు పోర్టల్​లో అప్​లోడ్ అవుతాయి. అక్కడ డ్రా స్వయంచాలకంగా జరుగుతుంది. దీని బహుమతి విలువ చాలా ఎక్కువ. సుమారు రూ.10 లక్షల నుంచి కోటి వరకు గెలుచుకోవచ్చు. ఇది వినియోగదారుడు తప్పకుండా జీఎస్టీ బిల్లు తీసుకునేలా చేస్తుంది."

- జోసెఫ్​, అసోచామ్ సమావేశంలో

జీఎస్టీ కౌన్సిల్ పరిశీలనతో

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో త్వరలోనే జీఎస్టీ మండలి సమావేశమై లాటరీ విధానం నిర్ణయం తీసుకుంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి. లాటరీ కోసం పరిగణనలోకి తీసుకోవాల్సిన బిల్లుల కనీస పరిమితిని కూడా కౌన్సిల్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశాయి.

ఆదాయానికి గండిపడకుండా

జీఎస్టీ ఆదాయానికి గండిపడకుండా అరికట్టడానికి.. వసూళ్లు పెంచుకునేందుకు కేంద్రం పలు ఆలోచనలు చేస్తోంది. లాటరీ, క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలు ప్రోత్సహించే పలు విధానాలను పరిశీలిస్తోంది.

ప్రస్తుతం నాలుగు అంచెల జీఎస్టీ విధానం ఉంది. వస్తు, సేవలపై 5, 12, 18, 28 శాతం పన్ను విధిస్తున్నారు. మరోవైపు విలాస వస్తువులు, డీమెరిట్ వస్తువులపై అత్యధికంగా సెస్​ వసూలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:కశ్మీర్​ యువతలో మార్పు.. ఉగ్రవాదానికి నో!

Last Updated : Feb 29, 2020, 4:11 AM IST

ABOUT THE AUTHOR

...view details