తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2020, 9:28 PM IST

ETV Bharat / business

'జమ్ముకశ్మీర్​లో లేహ్'​పై ట్విట్టర్​కు కేంద్రం నోటీసులు

లద్దాఖ్​కు చెందిన లేహ్​​ ప్రాంతాన్ని జమ్ముకశ్మీర్​ భూభాగంలో చూపించటంపై.. ట్విట్టర్​కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం.. అయిదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Govt issues notice to Twitter for showing Leh as part of J&K instead of UT of Ladakh
లద్దాఖ్ విషయంలో ట్విట్టర్​కు కేంద్రం నోటీసులు

లేహ్​ ప్రాంతాన్ని లద్దాఖ్​లో కాకుండా.. జమ్ముకశ్మీర్​ భూభాగంలో చూపించటంపై తీవ్రంగా పరిగణించింది కేంద్రం. ఈ అంశంపై ట్విట్టర్​కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న నోటీసులు పంపినట్టు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ వర్గాలు తెలిపాయి. మైక్రోబ్లాగింగ్​ ప్లాట్​ఫామ్​ సహా.. ఆ సంస్థ ప్రతినిధులపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పేర్కొంటూ ట్విట్టర్​ గ్లోబల్​ వైస్​ ప్రెసిడెంట్​కు నోటీసులు జారీ చేసింది. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

దేశ మ్యాప్​ను తప్పుగా చూపించి.. దేశ ప్రాదేశిక సమగ్రతను అగౌరవపరిచినందుకు చర్యలెందుకు తీసుకోకూడదో చెప్పాలని పేర్కొంది. దేశ సార్వభౌమత్వంపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు జరిగిన ఉద్దేశ పూర్వక ప్రయత్నమని తన నోటీసుల్లో స్పష్టం చేసింది కేంద్రం.

అంతకముందు కూడా..

భారత భూ భాగమైన లేహ్​ ప్రాంతాన్ని కొద్ది రోజుల క్రితం చైనాలో చూపించింది ట్విట్టర్​. ఈ అంశంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అనంతరం దీనికి ప్రతిస్పందనగా.. చైనా స్థానంలో జమ్ముకశ్మీర్​ను ఉంచింది. అయితే.. తప్పుగా చూపించిన ఈ మ్యాప్​ను ట్విట్టర్​ ఇప్పటివరకూ సరిచేయలేదు. ఇది భారత సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకిస్తుందని అధికావర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:'మధ్యతరగతి'కి కేంద్రం 'ఆత్మనిర్భర్​' కానుక

ABOUT THE AUTHOR

...view details