బీమా పాలసీదారు ఫిర్యాదుల పరిష్కారం కోసం పని చేసే అంబుడ్స్మన్ నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. బీమా బ్రోకర్లను వీరి పరిధిలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. పాలసీదారులు ఇకపై ఆన్లైన్లో ఫిర్యాదులు ఫైల్ చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
సవరించిన నిబంధనలతో అంబుడ్స్మన్కు ఫిర్యాదులను పరిష్కరించే పరిధి పెరగనుంది. ఇంతకు ముందు బీమా సంస్థలు, ఏజెంట్లు, బ్రోకర్లు సహా ఇత మధ్యవర్తుల సేవల్ల లోపాలకు సంబంధించిన వివాదాలకు మాత్రమే పరిష్కారం లభించేది.
బీమా అంబుడ్స్మన్ పక్రియను మరింత మెరుగుపరిచేందుకు నిబంధనలు సవరించినట్లు ఆర్థిక శాఖ వివరించింది. అంబుడ్స్మన్ నిబంధనలు 2017లో సవరణలను మార్చి 2న నోటిఫై చేసింది.