తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2020, 9:33 PM IST

ETV Bharat / business

జియోకు రూ.33,737 కోట్లు చెల్లించిన గూగుల్​

రిలయన్స్​ జియో ప్లాట్​ఫామ్​కు టెక్​ దిగ్గజం గూగుల్​ రూ.33,737 కోట్లు చెల్లించింది. ఒప్పందంలో భాగంగా ఈ చెల్లింపులు చేసి జియోలోని 7.73 శాతం వాటాను సొంతం చేసుకుంది గూగుల్.​

Google pays Rs 33,737 cr for 7.73% stake in Jio Platforms
జియోకు రూ.33,737 కోట్లు చెల్లించిన గూగుల్​

ఒప్పందంలో భాగంగా రిలయన్స్​ జియోకు రూ. 33,737 కోట్లు చెల్లించింది టెక్​ దిగ్గజం గూగుల్. ఫలితంగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ సబ్సిడరీ అయిన జియోలో 7.73 శాతం వాటాను సొంతం చేసుకుంది​. జియోలో పెట్టుబడులు పెట్టిన ఫేస్​బుక్​ వంటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల జాబితాలో గూగుల్​ కూడా చేరింది. అంతేకాకుండా భారతీయ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద అమెరికా టెక్​ సంస్థగా గూగుల్​ అవతరించింది.

ఈ చెల్లింపులతో జియో ప్లాట్​ఫాం విలువ రూ.1.52 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 11వారాల్లోనే 13 ఆర్థిక, వ్యూహాత్మక పెట్టుబడిదారులకు 33 శాతం వాటాను విక్రయించడం ద్వారా జియో ప్లాట్​ఫాం విలువ ఇంత భారీ మొత్తంలో పెరిగింది. 2021 మార్చి నాటికి తన నికర రుణాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యానికి రిలయన్స్​ చేరుకోవడానికి ఈ చెల్లింపులు ఉపయోగపడతాయి.

గూగుల్, జియో సంస్థలు సంయుక్తంగా కొత్త ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్​ను తయారు చేయనున్నట్లు జులైలో ఓ ప్రకటన చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు స్మార్ట్​ఫోన్​ను భారత మార్కెట్లోకి త్వరలోకి తీసుకురానున్నాయి.

ప్రస్తుతం 4 కోట్ల చందాదారులతో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది జియో.

ఇదీ చూడండి:ల్యాండ్​లైన్​ నుంచి కాల్​ చేస్తే '0' చేర్చాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details