తెలంగాణ

telangana

By

Published : Dec 14, 2020, 4:12 PM IST

ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తిడి ధర దిల్లీలో రూ.460 తగ్గింది. వెండి ధర కిలోకు భారీగా తగ్గి.. రూ.62,500 దిగువకు చేరింది.

gold and sliver prices
బంగారం, వెండి ధరలు

బంగారం ధర సోమవారం భారీగా రూ.460 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,371 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ తగ్గుతున్న కారణంగా దేశీయంగా ధరలు దిగొస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ వార్తలతో బంగారం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.629 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,469 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,830 డాలర్లకు తగ్గింది. వెండి ధర 23.82 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:9 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

ABOUT THE AUTHOR

...view details