తెలంగాణ

telangana

By

Published : Jan 22, 2021, 4:21 PM IST

ETV Bharat / business

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

మూడు రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49 వేల దిగువకు చేరింది. వెండి భారీగా రూ.800కు పైగా తగ్గింది.

Gold price down
దిగొచ్చిన బంగారం ధర

బంగారం ధర కాస్త దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర శక్రవారం రూ.263 తగ్గి.. రూ.48,861వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పడిపోవడం.. దేశీయంగా ధరలు తగ్గేందుకు కారణమని చెబుతున్నారు విశ్లేషకులు.

వెండి ధర కూడా కిలోకు(దిల్లీలో) రూ.806 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.66,032 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,861 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 25.52 డాలర్లకు దిగొచ్చింది.

ఇదీ చూడండి:మార్కెట్లపై బేర్​ పంజా.. 49 వేల దిగవకు సెన్సెక్స్

ABOUT THE AUTHOR

...view details