తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.150 పెరిగింది. వెండి కిలో ధర రూ.70వేల మార్కును చేరుకుంది.

By

Published : Jun 8, 2021, 7:38 PM IST

gold, silver price
బంగారం, వెెండి ధరలు

దేశంలో పసిడి ధరలు పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో మంగళవారం రూ.150 వృద్ధి చెంది.. రూ.48,800కి చేరింది.

వెండి ధర రూ.1,200 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,200 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1897 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 28.02 డాలర్ల వద్ద ఉంది.

ABOUT THE AUTHOR

...view details