తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడి ధరకు రెక్కలు.. నేడు ఎంత పెరిగిందంటే?

పసిడి, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.296 వృద్ధి చెందింది. కిలో వెండి ధర రూ.46 వేలు దాటింది.

By

Published : Nov 20, 2019, 4:44 PM IST

నేటి బంగారం ధరలు

పసిడి, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.296 వృద్ధి చెందింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుత ధర రూ.39,194కి చేరింది.

అంతర్జాతీయంగా పుత్తడి ధరలు పెరగటం, రూపాయి క్షీణించడం.. దేశీయంగా బంగారం ధర వృద్ధికి కారణమని నిపుణులు అంటున్నారు.

కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.331 వృద్ధితో.. రూ.46,103 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,478 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 17.17 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి: వాట్సాప్​ను వెంటనే అప్​డేట్​ చేసుకోండి.. లేదంటే అంతే!

ABOUT THE AUTHOR

...view details