తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం ధరలకు రెక్కలు- కిలో వెండి @75 వేలు - కిలో వెండి ధర

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర గురువారం రూ.225 ఎగిసింది. కిలో వెండి ధర రూ.ఏకంగా రూ.75 వేలు దాటింది.

TODAY GOLD RATE
నేటి బంగారం ధరలు

By

Published : Aug 6, 2020, 4:49 PM IST

Updated : Aug 6, 2020, 7:35 PM IST

బంగారం ధర గురవారం రూ.225 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయి వద్ద రూ.56,590 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగటం, రూపాయి విలువ క్షీణిస్తుండటం వంటి పరిణామాలు ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.

వెండి ధర గురువారం కిలోకు ఏకంగా రూ.1,932 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.75,755 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 2,045.70 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 27.57 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:అన్ని రంగాల్లోనూ అంబానీ ముద్ర- పోటీ వీరి నుంచే...

Last Updated : Aug 6, 2020, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details