దేశీయ మార్కెట్ల్లో పసిడి, వెండి ధరలు అంతకంతకూ ఎగబాకుతున్నాయి. పసిడి ధర సోమవారం రూ.120 పెరిగింది. దీంతో దిల్లీలో రూ. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49,960కు చేరింది. వెండి ధర కూడా కిలోకు రూ. 858 పెరిగి... రూ.52,462గా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి 1,805 డాలర్లు పలకగా... ఔన్సు వెండి ధర 19.03 డాలర్లుగా ఉంది.