తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2020, 4:08 PM IST

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నేటి లెక్కలివే....

రూపాయి విలువ క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.42,958 ఉంది. వెండి ధర మాత్రం రూ.58 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.46,213గా ఉంది.

Gold rises marginally by Rs 6, silver falls Rs 58
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.6 పెరిగి రూ.42,958కు చేరుకుంది. వెండి ధర మాత్రం రూ.58 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో రూ.46,213గా ఉంది.

రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలోనే పసిడి ధరలు పెరుగుతున్నాయని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్​లో

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్ బంగారం ధర 1,595 డాలర్లుగా, ఔన్స్ వెండి ధర 16.73 డాలర్లుగా ఉంది.

యూఎస్​ ఫెడ్​ వడ్డీ రేట్ల తగ్గింపు సహా ఇతర కేంద్ర బ్యాంకులు కూడా సరళీకృత ద్రవ్యవిధానాల వైపు మొగ్గుచూపవచ్చనే అంచనాలతో బంగారం ధరలు పెరిగాయని తపన్ పటేల్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:దూసుకెళ్లిన స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్​ 479 పాయింట్లు వృద్ధి

ABOUT THE AUTHOR

...view details