తెలంగాణ

telangana

ETV Bharat / business

పసిడి మరింత పైపైకి.. 10 గ్రాములు ఎంతంటే.. - పది గ్రాముల బంగారం ధర

పసిడి, వెండి ధరలు సోమవారం మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.185 ఎగిసి..రూ.54,600 వేలు దాటింది. కిలో వెండి ధర ఒక్క రోజే రూ.1,672 పెరిగింది.

gold price today
నేటి బంగారం ధరలు

By

Published : Aug 3, 2020, 5:16 PM IST

బంగారం ధర సోమవారం రూ.185 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయి వద్ద రూ.54,678 వద్దకు చేరింది.

డాలర్​తో పోలిస్తే.. రూపాయి విలువ సోమవారం తగ్గడం వల్ల దేశీయంగా బంగారం ధరలు పెరిగినట్లు విశ్లేకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా సోమవారం కిలోకు ఏకంగా రూ.1,672 (దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.66,742 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,973 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 24.30 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:మార్కెట్లపై బేర్​ పంజా- 11 వేల దిగువకు నిఫ్టీ

ABOUT THE AUTHOR

...view details