తెలంగాణ

telangana

ETV Bharat / business

పెరిగిన పసిడి ధరలు- ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే!

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం(Gold Price today), వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.230, కిలో వెండికి రూ.61 ఎగసింది.

By

Published : Nov 10, 2021, 10:01 AM IST

Gold price
బంగారం ధరలు

బంగారం ధర(Gold Price today) బుధవారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.230 ఎగసింది. పసడి బాటలో పయనించిన వెండి(Silver price today).. కిలోకు రూ.61 పెరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి ధర(Gold Price in Hyderabad) రూ.49,760గా ఉంది. కిలో వెండి ధర రూ.66,494 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు(Gold Price in Vijayawada) రూ.49,760కి, కేజీ వెండి ధర రూ.66,494కి చేరింది.
  • విశాఖపట్నంలో పది గ్రాములకు పుత్తడి ధర(Gold Price in Vizag) రూ.49,760గా ఉంది. కిలో వెండి ధర రూ.66,494కి పెరిగింది.

అంతర్జాతీయంగా..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1827.15 డాలర్లుగా ఉంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.35 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్,​ డీజిల్​ ధరలు..

దేశంలో ఇంధన​ ధరల్లో బుధవారం ఎలాంటి మార్పు లేదు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్​, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.108.18గా ఉంది. డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్​ రూ.110.33 కాగా.. డీజిల్​ రూ.96.43 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.109.03గా ఉండగా.. డీజిల్​ ధర రూ.95.17గా ఉంది.

ఇదీ చూడండి:'మరో 50 ఏళ్లు.. భారత స్టాక్‌ మార్కెట్ల పరుగే'

ABOUT THE AUTHOR

...view details