తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరగనున్న బంగారం ధర.. కారణమిదే!

వచ్చే 12-15 నెలల్లో బంగారం ధర భారీగా పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక డిమాండ్​తో పాటు.. తగినంత సరఫరా లేమితో 10 గ్రాముల పసిడి.. రూ.56 వేలపైకి చేరుతుందని భావిస్తున్నారు.

By

Published : May 13, 2021, 9:25 PM IST

Gold prices
పసిడి ధర

రానున్న రోజుల్లో దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ అనంతరం దేశీయ మార్కెట్లు దిద్దుబాటు చర్యలకు గురవుతాయని.. ఫలితంగా రానున్న 12-15 నెలల్లో మేలిమి పసిడి ధర కొత్త గరిష్ట స్థాయి అయిన రూ.56,500కు చేరుతుందని మోతీలాల్ ఓస్వాల్ అనే ఫైనాన్షియల్ సంస్థ అంచనా వేసింది.

డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ..

కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల సరఫరా- డిమాండ్​ల మధ్య వ్యత్యాసం పెరిగిపోయిందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. 2020లో లాక్​డౌన్​ అనంతరం అధిక డిమాండ్ ఉండగా.. తగినంత సరఫరా లేని కారణంగా గతేడాది బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేసింది. బడ్జెట్‌లో బంగారం దిగుమతి సుంకంపై కేంద్రం ప్రకటించిన కోత వల్ల కూడా ధరలు ప్రభావితం అవ్వొచ్చని వివరించింది.

ఈ ఏడాది మార్చిలో 160 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. గతేడాదితో పోలిస్తే దాదాపు 470 శాతం అధికం.

ఇవీ చదవండి:అక్షయ తృతీయ: లాక్​డౌన్​లోనూ బంగారం కొనండిలా..

సోమవారం నుంచి పసిడి బాండ్ల ఇష్యూ

ABOUT THE AUTHOR

...view details