తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన పసిడి ధర- వెండికి రెక్కలు - నేటి వెండి ధరలు

బంగారం ధర సోమవారం స్వల్పంగా దిగొచ్చింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.19 తగ్గగా.. కిలో వెండి రేటు రూ.646 పెరిగింది.

Gold declines marginally
స్వల్పంగా తగ్గిన పసిడి.. వెండి ధరకు రెక్కలు

By

Published : Feb 15, 2021, 3:45 PM IST

Updated : Feb 15, 2021, 4:03 PM IST

దేశీయంగా పసిడి ధర స్వల్పంగా తగ్గింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి రేటు సోమవారం రూ.19 తగ్గి.. రూ.46,286కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలో పసిడికి డిమాండ్​ తగ్గడం, రూపాయి విలువ పెరగటం వల్లే.. దేశీయంగా బంగారం ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు తెలిపారు.

వెండి ధర(దిల్లీలో) కిలోకు రూ.646 పెరిగి.. రూ.69,072కు ఎగబాకింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,819 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.48 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:జనవరిలో పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

Last Updated : Feb 15, 2021, 4:03 PM IST

ABOUT THE AUTHOR

...view details