తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆల్​టైం రికార్డు సృష్టించిన బంగారం ధరలు - gold price today

దేశీయంగా బంగారం ధరలు ఆల్​టైం రికార్డును సృష్టించాయి. 10 గ్రాముల పసిడి ధర తొలిసారిగా రూ.50 వేలు దాటింది. వెండి ధర కూడా రూ.61 వేలకు చేరింది. కరోనా సంక్షోభం వేళ మదుపరులు సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారంపై దృష్టి పెట్టడమే ఇందుకు కారణం.

GOLD PRICE RISES ALTIME HIGH
ఆల్​టైం రికార్డు సృష్టించిన బంగారం ధరలు!

By

Published : Jul 22, 2020, 5:28 PM IST

బంగారం ధరలు ఇవాళ ఆల్​టైం రికార్డును సృష్టించాయి. తొలిసారిగా 10 గ్రాముల పసిడి రూ.50 వేల గరిష్ఠ స్థాయిని దాటింది. మదుపరులు పుత్తడిపై పెట్టుబడులకు ఆసక్తి చూపడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక శాతం పెరగటం వల్ల తొమ్మిదేళ్ల గరిష్ఠానికి బంగారం ధర చేరింది.

దూసుకెళ్తోంది...

గత కొంతకాలంగా తగ్గినట్లే కనిపిస్తూ.. డబుల్ స్పీడ్​తో బంగారం ధరలు పెరగటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు, మూడు రోజులుగా 2 వేల పైచిలుకు పెరుగుదలను నమోదు చేసిన 10 గ్రాముల బంగారం ఇవాళ ఏకంగా 50 వేల మార్కును దాటింది.

అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా వరుస ఉద్దీపనల అంచనాలు పసిడి డిమాండ్​ను పెంచేశాయి. షేర్ మార్కెట్ పతనంతో మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంవైపు మళ్లుతున్నారు. దీంతో దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఒకే రోజు 500 రూపాయల పెరుగుదల నమోదు చేసింది.

వెండి ధర సైతం ఆకాశనంటుతోంది. కేజీ వెండి ధర సుమారు 3,400 రూపాయల మేర పెరిగి.. రూ.61 వేలకు మించింది.

అంతర్జాతీయ మార్కెట్​లో...

ప్రస్తుతం బంగారం ధర పెరుగుదలకు దేశీయ మార్కెట్​తో పాటు.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దోహదం చేశాయి. తాజాగా ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 1,859 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2011 తర్వాత ఔన్స్ బంగారం బంగారం ధర 1,800 డాలర్ల స్థాయిని దాటి 1,900 డాలర్ల వైపు పయనిస్తోంది.

వెంటనే కాకున్నా ఈ ఏడాదిలో బంగారం 1,900 డాలర్లను దాటి కొత్త ఆల్​టైం రికార్డును సృష్టిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఆశల పల్లకిలో

కరోనా కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించేందుకు మరిన్ని ఉద్దీపనలు ఉంటాయన్న కేంద్రం సంకేతాలు, డాలరుతో రూపాయి మారకం విలువ తగ్గుతూ వస్తుండటం... దేశీయంగా బంగారం ధర పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంటున్నారు.

ఇదీ చూడండి:అయోధ్య రామాలయం భూమిపూజ ఇలా...

ABOUT THE AUTHOR

...view details