తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2020, 4:40 PM IST

ETV Bharat / business

బంగారం భగభగ-రూ.45 వేలు దాటిన 10 గ్రాముల ధర

దేశంలో బంగారం, వెండి ధరలు మండిపోతున్నాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర ఇవాళ ఒక్క రోజే రూ.773 పెరిగి.. మరోమారు రూ.45 వేల రికార్డుస్థాయిని దాటింది. వెండి కిలోకు ఏకంగా రూ.48 వేలు మార్కును మించిపోయింది.

GOLD RATE
బంగారం ధర

బంగారం ధర ఇవాళ మరోమారు రికార్డు స్థాయికి చేరింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు ఏకంగా రూ.773 పెరిగి.. రూ.45,343కు చేరింది.

కరోనా భయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న అంచనాల నేపథ్యంలో బంగారమే సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు మదుపరులు. ఈ నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులు పెరిగి ధరలు భారీగా పుంజుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటికి తోడు డాలర్​తో రూపాయి మారకం విలువ 65 పైసలు క్షీణించి.. మారకం విలువ రూ.73.99కి చేరడమూ మరో కారణంగా చెబుతున్నారు.

వెండి ధర నేడు కిలోకు రూ.192 (దిల్లీలో) పెరిగి.. రూ.48,180కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్సు బంగారం ధర 1,678 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సుకు 17.34 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:'ఎస్ బ్యాంకు ఖాతాదారుల డబ్బు సురక్షితమే'

ABOUT THE AUTHOR

...view details