తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం భగభగ- రూ.47వేలు దాటిన 10 గ్రాముల ధర - SILVER PRICE TODAY

పసిడి, వెండి ధరలు మంగళవారం పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.47 వేలు దాటింది. వెండి ధర ఒక్క రోజే రూ.893 పెరిగింది.

gold rate in India
బంగారం ధరలు

By

Published : Jun 9, 2020, 5:13 PM IST

బంగారం ధర మంగళవారం భారీగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.402 ఎగిసి.. రూ.47,235 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగటం కారణంగా ఆ ప్రభావం దేశీయంగా పడింది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు మంగళవారం రూ.893(దిల్లీలో) పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.49,344 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,705 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.63 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఆ చమురు సంస్థలో 10 వేల ఉద్యోగాలు కట్!

ABOUT THE AUTHOR

...view details