బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.303 పెరిగి.. రూ.47,853 వద్దకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం పసిడి ధర పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - silver rate in delhi
పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర మంగళవారం దాదాపు రూ.303 పెరిగింది. వెండి ధర కిలో రూ.70,261 వద్ద స్థిర పడింది.
![స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు gold and silver price](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12140253-thumbnail-3x2-gold.jpg)
బంగారం, వెండి ధరలు
పసిడి బాటలోనే వెండి ధర కూడా రూ.134 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,261 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,864 డాలర్లుగా ఉంది. వెండి ఔన్సుకు 27.65 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.